"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
నారాయణపేట
నారాయణపేట, తెలంగాణ రాష్ట్రములోని నారాయణపేట జిల్లా,నారాయణపేట మండలానికి చెందిన గ్రామం/పట్టణం.[1][2]
నారాయణపేట | |
— మున్సిపాలిటీ — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నారాయణపేట జిల్లా |
మండలం | నారాయణపేట |
ప్రభుత్వము | |
- మున్సిపల్ కమిషనర్ | గందె అనసూయ చంద్రకాంత్ |
పిన్ కోడ్ | 509 210 |
ఎస్.టి.డి కోడ్ |
ఇది హైదరాబాదుకు 168 కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది.ఇది రెండవ గ్రేడు మున్సిపాలిటీగా కొనసాగుతోంది.
Contents
గణాంకాలు
2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 97,838 - పురుషులు 48,769 - స్త్రీలు 49,069.అక్షరాస్యుల సంఖ్య 50110.[3]. పిన్ కోడ్: 509210.మండలంలో పట్టణ జనాభా 41539 కాగా, గ్రామీణ జనాభా 56235.
పురపాలక సంఘం
పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో, మొట్టమొదటిసారిగా నారాయణపేట పురపాలక సంఘాన్ని1945-46లో ఏర్పాటుచేశారు. మధ్యలో కొంతకాలం నగరపంచాయతీగా కొనసాగి, ప్రస్తుతం రెండో గ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతోంది.
రవాణా సదుపాయాలు
నారాయణపేట పట్టణానికి హైదరాబాదు నుండి మహబూబ్ నగర్ మీదుగా మంచి బస్సు సౌకర్యము ఉంది. రంగారెడ్డి జిల్లా తాండూరు నుండి కోస్గి, మద్దూరుల మీదుగా, కర్ణాటక రాష్ట్రం నుండి కూడా బస్సు సౌకర్యము ఉంది. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రస్థానమైననూ రైలు సౌకర్యం లేదు. సమీపంలోని రైలుస్టేషను దేవరకద్ర. ఇది నారాయణపేట నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాండూరు రైల్వే స్టేషను 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటకలోని యాద్గిర్ రైల్వే స్టేషను నారాయణపేట నుండి 51 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రత్యేకం
ఇది పట్టు చీరలకు,బంగారు ఆభరణాల వ్యాపారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు జిల్లాలోనే ముఖ్య వ్యాపార కేంద్రంగా విలసిల్లిననూ, ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా లేదు.
విద్యాసంస్థలు
- డిగ్రీ కళాశాలలు - 2
- జూనియర్ కళాశాలలు - 3
- ఇంజనీరింగ్ కళాశాలలు - 0
- బిఇడి కళాశాలలు - 3
బ్యాంకులు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు
- భారతీయ స్టేట్ బ్యాంకు
- ఆంధ్రా బ్యాంకు
- కెనరా బ్యాంకు
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు
- సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు
ప్రధాన సంఘటనలు
- 2005, ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు మావోయిస్టుల తూటాలకు స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, మక్తల్ శాసనసభ్యుడు అయిన చిట్టెం నర్సిరెడ్డితో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు[4]. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరణించినవారిలో నర్సిరెడ్డితో పాటు పురపాలక సంఘం కమీషనర్ రాంమోహన్, నర్సిరెడ్డి కుమారుడు చిట్టెం వెంకటేశ్వరరెడ్డి కూడా ఉన్నారు.
- 2000 అక్టోబరు 16 లో సినియర్ జర్నలిస్ట్ కొటకొండ యెడ్ల విజయరాజు అధ్వర్యంలో వార్తతరంగాలు తెలుగు దినపత్రిక ప్రారంబించడము జరిగింది. అప్పటి మంత్రి యెల్కొటి యల్లారెడ్ది, మాజీ ఎమ్మెల్యే చిట్టం నర్సిరెడ్డి, కొదంగల్ యెమ్మెల్యే సుర్యనారాయణ, బిజెపి నాయకుడు నాగురవు నామజి, అప్పటి మునిసిపల్ చైర్మన్ గడ్డం సాయిబన్న తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
- ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 10, తేది 15-08-2008