"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పామిడి
పామిడి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | అనంతపురం |
మండలం | పామిడి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | {{#property:P1082}} |
- పురుషుల సంఖ్య | 13,583 |
- స్త్రీల సంఖ్య | 13,303 |
- గృహాల సంఖ్య | 6,328 |
పిన్ కోడ్ | 515775 |
ఎస్.టి.డి కోడ్ |
పామిడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా,పామిడి మండలానికి చెందిన పట్టణం.ఇది పురపాలకసంఘం హోదా కలిగి ఉంది. అదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం.
ఇది జిల్లా కేంద్రమైన అనంతపురం నుండి 44వ నెంబరు జాతీయ రహదారిలో హైదరాబాదు వెళ్ళే వైపు 30 కి.మి. దూరంలో ఉంది. జిల్లాలో మరో ముఖ్య పట్టణమైన గుత్తి నుండి 20 కి.మీ. దూరంలో ఉంది. గుత్తి రైల్వే జంక్షను పామిడి గ్రామానికి సమీప రైల్వే జంక్షను.ఇది సమీప పట్టణమైన అనంతపురం నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.
Contents
- 1 గ్రామ చరిత్ర
- 2 గణాంక వివరాలు
- 3 విద్యా సౌకర్యాలు
- 4 వైద్య సౌకర్యం
- 5 తాగు నీరు
- 6 పారిశుధ్యం
- 7 సమాచార సౌకర్యాలు
- 8 ఇతర సౌకర్యాలు
- 9 రవాణా సౌకర్యాలు
- 10 మార్కెటింగు, బ్యాంకింగు
- 11 ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
- 12 విద్యుత్తు
- 13 భూమి వినియోగం
- 14 నీటిపారుదల సౌకర్యాలు
- 15 ఉత్పత్తి
- 16 ముఖ్య వృత్తులు
- 17 దేవాలయాలు
- 18 ఇతర విశేషాలు
- 19 మూలాలు
- 20 వెలుపలి లంకెలు
గ్రామ చరిత్ర
స్థల పురాణం: పామిడి గ్రామానికి ఆ పేరు "పాము ముడి" అన్న పద బంధం నుండి వచ్చినట్లు చెబుతారు. భోగేశ్వర స్వామి లింగానికి ఒక పాము ఎప్పుడూ చుట్టుకుని ఉండేదని, అందువల్ల ఆ ప్రదేశానికి "పాము ముడి" అన్న పేరు వచ్చిందని, అదే కాలక్రమేణా పామిడి అయిందని చెబుతారు. భోగేశ్వర స్వామి స్వయంభువని ప్రజల నమ్మకం. స్వామి వారి ఆలయం ఈ ఊరి ముఖ్య ఆకర్షణ.
గణాంక వివరాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6328 ఇళ్లతో, 26886 జనాభాతో 2716 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 13583, ఆడవారి సంఖ్య 13303. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3352 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 286. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594864[1].పిన్ కోడ్: 515 775.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 13, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, సమీప మేనేజిమెంటు కళాశాల గుత్తిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్లు, సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అనంతపురం లో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
పామిడిలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక అలోపతి ఆసుపత్రిలో ఐదుగురు డాక్టర్లు ,14 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక కుటుంబ సంక్షేమ కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
గ్రామంలో 0 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. 8 మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార సౌకర్యాలు
పామిడిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
ఇతర సౌకర్యాలు
పామిడి గ్రామం మండల కేంద్రం కూడా అవటంవల్ల అన్ని సదుపాయాలూ ఉన్నాయి. గ్రంథాలయం, ఆసుపత్రి,ఒక డిగ్రి కళాశాల, ఒక జూనియర్ కళాశాల, హై స్కూళ్ళు ఉన్నాయి. పామిడి గ్రామ పంచాయతి కార్యాలయము ఆవరణములో పట్టణ మంచినీటి సౌకర్యార్థము తక్కువ ధరతో మంచినీటిని అందచేస్తున్నారు.
రవాణా సౌకర్యాలు
జిల్లా కేంద్రం నుండి బస్సులున్నాయి. జిల్లాలో ముఖ్య పట్టణమైన గుత్తి నుండి కూడా బస్సు సౌకర్యం బాగుంది. దగ్గరి రైల్వే స్టేషను ఇక్కడికి 2 కి.మి. దూరంలో గల కల్లూరు రైల్వే స్టేషను.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 8 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
పామిడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 369 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 554 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 80 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 520 హెక్టార్లు
- బంజరు భూమి: 809 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 381 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1490 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 220 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
పామిడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 86 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 133 హెక్టార్లు
ఉత్పత్తి
పామిడిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
ముఖ్య వృత్తులు
పెన్నా నది తీరాన ఉన్న ఈ గ్రామ జనాభాలో అధిక శాతం మందికి కుట్టుపని జీవనాధారం. ఇక్కడి వస్త్ర వ్యాపారం చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ప్రసిద్ధి. వ్యవసాయం మరో ముఖ్య జీవనాధారం. వరి,వేరుశెనగ, పత్తి ముఖ్య పంటలు. పళ్ళ తోటల సాగు కూడా అధికం. ముఖ్యంగా జామ, బత్తాయి, మామిడి తోటలు బాగా సాగులో ఉన్నాయి.
దేవాలయాలు
పామిడిలో భోగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ గజేంద్ర మోక్ష లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం ఉన్నాయి. తగ్గు దేవాలయము అనే పేరుతో వెలసిల్లుతున్నది.పెన్నానది ఒడ్డున గల భోగేశ్వర స్వామి దేవస్థానంలో పరమేశ్వరుడు బోగేశ్వరుడిగా పిలువబడుతూ పెద్దదయిన లింగాస్వరూపంతో పెద్ద పాణివట్టముతో నిత్య అబిషేక పూజలు అందుకుంటున్నాడు. బోగేశ్వర దేవస్థాన ఆలయ ప్రాంగణం ప్రశాంతమయిన వాతావరణం కలిగివుంటుంది. ఈ దేవాలయంనందు కార్తీక మాసంలో జరుగు లక్ష దీపారాధన కార్యక్రమంలో పట్టణ ప్రజలు విశేషంగా పాల్గొంటారు. అంతే కాకుండా శివరాత్రిని మండల ప్రజలందరూ ఆరోజు ఆలయ ప్రాంగణం నందే ఉపవాసం, జాగరణ చేస్తూ నిత్య అభిషేకాలలో పాల్గొంటారు.
శ్రీ లక్ష్మి నారాయణ స్వామి దేవస్థానం రాతికట్టడం.ఈ ఆలయం శ్రీ కృష్ణ దేవరాయలు కాలంనాటిది అని ప్రతీతి.ఈ ఆలయం త్రవ్వకాలలో బయటపడినట్టుగా ఈ గ్రామ ప్రజలు చెప్పుకుంటున్నారు.అందుకే ఈ దేవాలయం తగ్గులో వున్నదని నమ్ముతున్నారు.అందువలన ఈ ఆలయం తగ్గు దేవాలయముగా పిలవబడుతుంది. ఈ ఆలయం మూర్తి పూర్తి క్రింది బాగంలో ఒక ముసలి గజేంద్రున్నిపట్టుకున్నట్టు ఆ గజేంద్రుడు తొండం పైనకు వుంచి దేవుడు గురించి ప్రార్థించినట్టుగా ఉంది. దాని పై భాగం గరుడుని పై నారాయణుడు లక్ష్మీ సమేతుడై వచ్చినట్టుగా అద్భుతంగా ఉంది.అందువలన ఈ మూర్తి గజేంద్ర మోక్ష లక్ష్మీ నారాయణుడిగా నిత్య పూజలు అందుకుంటూ ప్రతి ఏకాదశికి పల్లకి ఉత్సవాలు జరుపుకుంటున్నది.
ఇతర విశేషాలు
- పామిడిలో ఆషాఢ మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం రోజు గ్రామదేవత అయిన పామిడమ్మ దేవత ఉత్సవాన్ని గ్రామ ప్రజలందరూ పామిడమ్మ తేరుగా విశేషంగా జరుపుకుంటారు. అదే ఆషాఢ మాసంలో ఏకాదశి నుండి పౌర్ణమి దాక ఉట్ల తేరు ఉత్సవాలు జరుగుతాయి. పామిడి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవస్థానంలో దసరా ఉత్సవాలు బాగా జరుపబడతాయి. అంతేకాక వినాయక చవితి పండుగలో కుల మతాలకు అతీతంగా పాల్గొనటం విశేషం.
- పామిడి గ్రామంలో తెలుగుతో సమానంగా మరాఠి భాష కూడా చలామణిలో ఉంది. దీనికి కారణం ఇక్కడి ముఖ్య వాణిజ్యమైన వస్త్ర వ్యాపారంలో మరాఠి మాతృభాషగా గల భావసార క్షత్రియ ప్రజలు అధిక సంఖ్యలో ఉండటం. అందువల్ల ఇక్కడ వినాయక చవితి పండుగ, కృష్ణాష్టమి ఘనంగా జరుపబడుతాయి. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున ఉట్లు పడగొట్టటమన్నది ఇక్కడ చాలా వేడుకగా జరుగుతుంది.
- పామిడి గ్రామానికి జీవనది అయిన పెన్నా నది క్రమంగా తన ఉనికిని కోల్పోవటం వల్ల ఇప్పుడు పామిడి గ్రామం వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నది. క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వస్త్ర వ్యాపారంలో పుంజుకోవటంతో ఇక్కడి వ్యాపార వాణిజ్యాలు మందగించాయి. ప్రస్తుతం కుట్టుపని కొనసాగిస్తూ ప్రపంచ వస్త్ర వాణిజ్యంలో తమ ఉనికిని కాపాడుకోవటానికి ఇక్కడి ప్రజల ప్రయత్నం కొనసాగుతోంది.