"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
భారతీయ చిత్రకళ

భారతీయ కళలలో భారతీయ చిత్రకళ అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలది. అతి పురాతన భారతీయ చిత్రాలు మానవునికి చరిత్ర గురించి తెలియక ముందే ఇక్కడ రాతి పై చిత్రీకరించటం జరిగింది. క్రీ.పూ 5500 లోనే మధ్య ప్రదేశ్ లోని రాయ్సేన్ జిల్లాకి చెందిన భీంబేట్కాలో రాతిని చిత్రపటంగా మొలిచిన దాఖలాలు ఉన్నాయి. బౌద్దమత సాహిత్యమంతనూ చిత్రపటాలు గల రాజభవనాలు, సైనిక భవనాలు గురించి వివరించబడిన ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. అయితే అజంతా గుహలలో గల చిత్రపటాలు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకొన్నవి. మధ్య యుగానికి చెందిన వివిధ రాతప్రతులలోనూ చిత్రకళ ఆనవాళ్ళు ఉన్నాయి. పర్షియన్ సూక్ష్మ చిత్రకళ భారతీయ సాంప్రదాయిక చిత్రకళతో సంగమించి ముఘల్ చిత్రకళ అవతరించింది. 17వ శతాబ్దంలో ఈ శైలి దేశంలోని అన్ని మతాలకి చెందిన రాజ్యాలకి విస్తరించి స్థానిక సొబగులని అద్దుకొన్నది. తెల్లదొరల కోసం కంపెనీ కలం అవతరించటంతో బ్రిటీష్ సామ్రాజ్యం 19వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రభావం గల కళా విశ్వవిద్యాలయాలని నెలకొల్పినది. ఈ స్థాపనలు ఆధునిక భారతీయ చిత్రకళా శైలికి ప్రాణం పోయటం ఇవి మరల భారతీయ మూలాలకే తిరిగి వెళ్ళటానికి మొగ్గు చూపటం విశేషం.
భారతీయ చిత్రకళ ప్రాచీన నాగరికతకి ప్రస్తుత కాలానికి మధ్య గల వైరుధ్యాన్ని ప్రతిబింబించే ఒక అందమైన కళా స్రవంతి. తొలుత దీని ప్రాథమిక ఉద్దేశం మతమే అయిననూ తర్వాతి కాలంలో ఇది వివివిధ సంస్కృతులు, సంప్రదాయాల కలయికకి నిలువుటద్దంలా నిలచింది.
భారతీయ చిత్రకారులు
- సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు)
- అంట్యాకుల పైడిరాజు
- అడివి బాపిరాజు
- ఆర్.కె.లక్ష్మణ్
- ఎం.ఎఫ్. హుసేన్
- కాపు రాజయ్య
- కొండపల్లి శేషగిరి రావు
- చింతపట్ల వెంకటాచారి
- దామెర్ల రామారావు
- నందికోళ్ల గోపాలరావు
- నందిని గౌడ్
- పాకాల తిరుమల్ రెడ్డి
- మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము
- రవీంద్రనాధ టాగూరు
- రాజా రవివర్మ
- లక్ష్మణ్ ఏలె
- లక్ష్మా గౌడ్
- వడ్డాది పాపయ్య
- సత్తిరాజు శంకర నారాయణ
- సి.ఎన్.వెంకటరావు
- రామ్కుమార్ (చిత్రకారుడు)